న్యూఢిల్లీ: మన్ కీ బాత్ ప్రసంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్లో విమర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ట్విట్టర్లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కరోనా పోరుపై సీఎం దృష్టిసారించాలి గానీ ప్రధాని మోదీపై కాదని అన్నారు. “దేశ ప్రధానిపై ఒక ప్రకటన చేస్తున్నప్పుడు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మహమ్మారిపై పోరాడాలన్న సంగతిని ఆయన మర్చిపోకూడదు. మీ వైఫల్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖండించదగినది ” అని హిందీలో ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాను మూసివేసి, నిధులు ఖర్చు చేయకుండా కేంద్రమే అంతా చేయాలని హేమంత్ సోరెన్ కోరుతున్నారని హర్ష వర్థన్ ఆరోపించారు. “కరోనా వైరస్ తో పోరాడండి, ప్రధానితో కాదు” అని ఘటుగా వ్యాఖ్యానించారు.