రాంచీ: లారీలను మోసుకెళ్తున్న ఫెర్రీ, గంగా నదిలో బోల్తాకొట్టింది. దీంతో దానిని నడుపుతున్న సిబ్బంది మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలోని సాహిబ్గంజ్ నుంచి బీహార్లోని కతిహార్ జిల్లా మణిహరి మధ్య ఈ సంఘటన జరిగింది. చిన్న చిన్న కంకర రాళ్ల లోడ్తో ఉన్న 9 లారీలను తరలిస్తున్న ఫెర్రీ మార్గమధ్యలో బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు పది మంది గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.
మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనపై రగడ జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఫెర్రీలోని లారీలు ఓవర్ లోడ్తో ఉన్నాయని, చిన్న చిన్న కంకర రాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే ఆ ఫెర్రీని అనధికార ఘాట్ నుంచి నిర్వహిస్తున్నారని విమర్శించారు. సీఎం హేమంత్ సోరెన్ ప్రోద్బలంతోనే అధికారులు ఈ అక్రమ కంకర రాళ్ల వ్యాపారానికి అనుమతిస్తున్నారని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ఆరోపించాయి.