Mahua Moitra : పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష టీఎంసీ (TMC) ముఖ్య నాయకులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు అభిషేక్ బెనర్జీ (Abhisheik Banerjee) పైనా, కొందరు మాజీ మంత్రులపైన భౌతిక దాడులు జరిగాయి. తాజాగా మహిళా ఎంపీపై మహువాపై దాడికి పాల్పడ్డారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద టీఎంసీ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై కొందరు కోడిగుడ్లతో చేశారు. తనపై దాడి జరిగిన విషయాన్ని మహువానే స్వయంగా ధ్రువీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.