హైదరాబాద్: పవర్ప్యాక్డ్ ఫుడ్గా చెప్పే గుడ్డు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. శరీరానికి పోషకాలన్నీ అందాలంటే గుడ్డు మంచి ఆహారమని నిపుణులు సూచిస్తారు. కండపుష్టికి కలిగించే ఈ ఆహారాన్ని రోజూ తీసుకోవాలని జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (ఎన్ఈసీసీ) ప్రచారం చేస్తున్నది. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ఎన్ఈసీసీ నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నది. ఎన్ఈసీసీని డాక్టర్ బీవీ రావు (నవంబర్ 6న ఆయన జయంతి) 1982లో స్థాపించారు. ఇందులో 25 వేల మందికి పైగా సభ్యత్వం ఉన్నది. దేశంలో పౌల్ట్రీ ప్రధానంగా ఎగ్ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ఈసీసీ కృషి చేస్తున్నది. తన విశేష కృషి ఫలితంగా.. బీవీరావు భారత పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడిగా పేరుగాంచారు.