చెన్నై: విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మలచడానికి, వారిని ప్రోత్సహించడానికి డీఆర్డీవో తమ ‘టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్’ స్కీమ్ కింద రూ.10కోట్లు కేటాయిస్తున్నట్టు సంస్థ చైర్మన్ సతీశ్ రెడ్డి చెప్పారు. ఇంక్యుబేషన్ సెంటర్లలో చేరి పరిశోధనలు నిర్వహించే ఒక్కో డిజైన్కు రూ.కోటి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కాంచీపురం ట్రిపుల్ ఐటీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.