పనాజీ: తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్కు.. ఈ యేటి పీఆర్సీఐ చాణక్య అవార్డు దక్కింది. పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే ఈ అవార్డును దిలీప్ అందుకోవడం వరుసగా ఇది రెండవ సారి. గోవా సీఎం ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా దిలీప్ ఈ అవార్డును స్వీకరించారు. గోవాలో ఈ నెల 17వ తేదీన జరిగిన 15వ పీఆర్సీఐ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ మీడియా శాఖ అత్యద్భుత పనితీరును గుర్తిస్తూ కొణతం దిలీప్కు ఈ అవార్డును ప్రజెంట్ చేశారు. రెండోసారి అవార్డు గెలుచుకున్న దిలీప్కు మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ తెలిపారు.
పబ్లిక్ రిలేషన్స్ రంగంలో వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్లు కనబరిచే అసాధారణ ప్రతిభ ఆధారంగా పీఆర్సీఐ చాణక్య అవార్డులను అందజేస్తారు. అయితే తాము పనిచేస్తున్న ఆయా రంగాల్లో దేశానికి పేరు తెచ్చిన అచీవర్స్, నేతలకు ఈ అవార్డులను పీఆర్సీఐ ఇస్తుంది. 2020 సంవత్సరంలో కూడా చాణక్య అవార్డును దిలీప్ గెలుచుకున్నారు. బెంగుళూరులో జరిగిన ఈవెంట్లో ఆయన ఆ అవార్డును అందుకున్నారు.