ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ కామెంట్ చేశారు. ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఉద్దవ్ను కపట రాజుగా చిత్రీకరించారు. ఒకప్పుడు ఓ కపట రాజు ఉండేవాడు అంటూ అమృత తన ట్వీట్లో ఉద్దవ్పై వ్యాఖ్యలు చేశాయి. అయితే ఆ ట్వీట్ను ఆమె డిలీట్ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ మంత్రి ఏక్నాథ్ షిండే సుమారు 46 మంది ఎమ్మెల్యేలతో అస్సాం వెళ్లిపోయారు. తానేమీ శివసేను వీడడం లేదని, కానీ బీజేపీతో పొత్తుపై ఉద్దవ్ ఆలోచించాలని ఏక్నాథ్ కోరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి పాలన చేస్తున్నది.