న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్ ఆదివారం భారత్ చేరుకొన్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్ రాజకుటుంబీకులు భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా సీఐఐ ‘ఇండియా-డెన్మార్క్: పార్ట్నర్స్ ఫర్ గ్రీన్ అండ్ సస్టెయినబుల్ ప్రోగ్రెస్’ సెషన్ను ఉద్దేశించి యువరాజు ఫ్రెడెరిక్ ప్రారంభోపన్యాసం చేస్తారు.