గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో కమర్షియల్ డీజిల్ ట్రక్స్ రాకపోకలపై నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. పెద్దవాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాల్ని కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నారు.
పరిశ్రమలపై కూడా
గాలి నాణ్యత మెరుగు పడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం. అందులో భాగంగా జీవ ఇంధనం, లిక్విడ్ పెట్రోల్, నేచురల్ గ్యాస్తో నడిచే పరిశ్రమలకు మాత్రమే అనమతిస్తారు. అంతేకాదు రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే, పోయిన ఏడాది అవలంబించినట్టే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి అనుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం.