న్యూఢిల్లీ : సీజేపీ నిరసన సందర్భంగా తనపై పోలీసులు పెల్లెట్ గన్తో దాడి చేసినట్లు 19 ఏండ్ల సాహిల్ లోచబ్ అనే నిరసనకారుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్ బయట ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బైఠాయించి నిరసన తెలిపిన కొద్ది గంటలకే ఈ చర్య తీసుకున్నారు.
అయితే ఈ ఎఫ్ఐఆర్లో ఏ వ్యక్తి పేరునూ నిందితుడిగా పేర్కొనలేదు. తాజా సమాచారం ప్రకారం బీఎన్ఎస్లోని సెక్షన్లు 118, 125 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.