Delhi HC : బహిరంగ ప్రదేశాల్లోగోడల మీద దేవుళ్ల ఫొటోలు అతికించడంపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ‘బహిరంగ ప్రదేశాల్లో గోడలపై దేవుళ్ల ఫొటోలు అతికించడంపై నిషేధం విధించండి. దాంతో వాటిపై ప్రజులు ఉమ్మివేయకుండా, మూత్ర విసర్జన చేయకుండా చూడొచ్చ’ని గోరంగ్ గుప్తా అనే న్యాయవాది పిటిషన్ వేశాడు. అయితే, ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్ను విచారణకు స్వీకరించలేదు. బహిరంగ ప్రదేశాల్లోని గోడల మీద దేవతల ఫొటోలు అతించడం అనేది సెక్షన్ 295 (ప్రార్థన స్థలాల పవిత్రతను దెబ్బతీయడం), సెక్షన్ 295ఏ (ఉద్దేశపూర్వకంగా అన్యమతస్తుల మనోభావాలను దెబ్బతీయడం) ఉల్లంఘన కిందకు వస్తుందని గోరంగ్ తన పిటిషన్లో తెలిపారు.
‘పబ్లిక్ ప్లేస్లలోని గోడల మీద ఎవరూ ఉమ్మివేయడం, మూత్ర విసర్జన చేయడం, చెత్తాచెదారం పడేయడం వంటివి చేయకుండా అక్కడ కొందరు దేవుళ్ల ఫొటోలు అతికిస్తారు. దాంతో వాళ్లు అలా చేయకుండా ఉంటారని వాళ్ల నమ్మకం. కానీ, కొందరు అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉమ్మివేస్తారు. మూత్రవిసర్జన కూడా చేస్తారు. దానివల్ల ప్రజల మత విశ్వాసాలు దెబ్బతింటాయి’ అంటూ గోరంగ్ తన పిటిషన్లో రాసుకొచ్చాడు.