Manish Sisodia | మద్యం పాలసీ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ను పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో.. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనీష్ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాను మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఫిబ్రవరి 26న లిక్కర్ పాలసీ వ్యవహారంలో సిసోడియా పాత్రపై 8 గంటల పాటు సీబీఐ విచారించింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించినా.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.