న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)కి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా లభించింది. 58 ఏళ్ల నుంచి ఐఐఎంసీ అందిస్తున్న జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపై కేవలం డిప్లొమాలు మాత్రమే కాకుండా డిగ్రీలను ఇచ్చేందుకు ఈ సంస్థకు అధికారం కల్పించినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్తగా లభించిన హోదా వల్ల డాక్టొరల్ ప్రోగ్రామ్స్ను కూడా ఈ సంస్థ ఆఫర్ చేయవచ్చు.