న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన ఇంట్రానాసల్ కోవిడ్ మందును బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కావాల్సిన ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ శాఖ అనుమతి ఇచ్చింది. సుమారు 900 సబ్జెక్ట్స్పై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బూస్టర్ డోసు మూడవ దశ స్టడీ చేపట్టేందుకు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇంట్రానాసల్ టీకాలను ముక్కు ద్వారా ఇస్తారు. ద్రవ రూపంలో ఉండే ఆ మందును నాసికా రంధ్రం ద్వారా ఎక్కిస్తారు. అయితే ట్రయల్స్ నిర్వహించేందుకు కావాల్సిన ప్రోటోకాల్ను సమర్పించాలని మూడు వారాల క్రితం భారత్ బయోటెక్ను నిపుణుల కమిటీ ఆదేశించింది. ముక్కు ద్వారా ఇచ్చే కోవిడ్ టీకాలను ఇండియాలో తొలిసారి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. మూడవ డోసు మూడవ దశ ట్రయల్స్ కోసం అప్లికేషన్ ఇచ్చిన సంస్థల్లో భారత్ బయోటెక్ రెండవది. ముక్కు ద్వారా ఇచ్చే టీకాలతో అన్ని రకాల కోవిడ్ వేరియంట్లను నియంత్రించవచ్చు.