Cyclone Michaung | భువనేశ్వర్, డిసెంబర్ 3: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు.
ఈ సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా రాష్ర్టాల అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు 54 రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రకటించింది.