న్యూఢిల్లీ: టీకాల కొరతతో ఢిల్లీలో 18-44 ఏండ్ల వయసు వారికి ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ను నిలిపివేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మే నెలలో 16 లక్షల టీకాలే అందాయని, జూన్ నెలకు కేంద్రం ఆ కోటాను 8 లక్షలకు తగ్గించిందని తెలిపారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 50 లక్షల మందికి టీకావేశామని, అందరికీ టీకా వేయాలంటే ఇంకా 2.5 కోట్లడోసులు అవసరమని పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి స్వస్థలాలకు 8 లక్షల మంది వలసకూలీలు
కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల గత నాలుగు వారాల్లో 8 లక్షల మందికి పైగా వలస కార్మికులు ఢిల్లీని వదిలి తమ స్వస్థలాలకు వెళ్లారని ఢిల్లీ రవాణా విభాగం తెలిపింది. ఇతర రాష్ర్టాలను సమన్వయం చేసుకొని ప్రత్యేకంగా బస్సులు నడపడంతో వాళ్లు ఇబ్బందులు లేకుండా ఇళ్లకు చేరుకోగలిగారని తెలిపింది.