చెన్నై: తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్త ప్లాంట్లో ఆరవ యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రియాక్టర్ నిర్మాణం కోసం ఇవాళ శంకుస్థాపన స్థలం వల్ల కాంక్రీట్ పోశారు. రష్యాకు చెందిన స్టేట్ ఆటోమిక్ ఎనర్జీ కార్పొరేషన్ (రొస్తమ్) ఈ విషయాన్ని చెప్పింది. జూన్లో అయిదో నెంబర్ పవర్ యూనిట్ వద్ద కాంక్రీట్ వేశామని, డిసెంబర్ 20వ తేదీన ఆరవ యూనిట్ వద్ద కాంక్రీట్ వేసినట్లు రష్యా అధికారి, ప్రాజెక్టు డైరక్టర్ ఆండ్రూ లిబెదేవ్ తెలిపారు. కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద్వారా తమిళనాడులోని పరిశ్రమలు, కమర్షియల్ డెవలప్మెంట్ వ్యాపారులకు అదనపు విద్యుత్తును అందించనున్నారు.