ఢిల్లీ: ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం ప్రారంభించారు.
న్యాయవాదులు, కక్షిదారులు భేటీ అయ్యేందుకు వీలుగా సువిశాలంగా దీన్ని నిర్మించారు. ఇందుకోసం ఫిబ్రవరిలో స్వయంగా స్థలాన్ని ఎంపిక చేసిన సీజేఐ, నిర్మాణం త్వరితగిన పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు.