చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్పై చైనా ప్రభుత్వం తెగ ప్రశంసలు కురిపిస్తోంది. ప్రదీప్ రావత్ను చైనా రాయబారిగా భారత ప్రభుత్వం నూతనంగా నియమించింది. ఈయనకు చైనా భాషలో అద్భుతంగా మాట్లాడగలరు. ప్రదీప్ రావత్ను రాయబారిగా నియమించడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని చైనా ప్రభుత్వం పేర్కొంది. ఈ నియామకం వల్ల ఇరు దేశాల మధ్య వున్న పొరపొచ్చాలు, విభేదాలు కనుమరుగవడం ఖాయమని చైనా అభిప్రాయపడింది. ఈ విషయాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
ప్రదీప్ రావత్కు చైనా భాష కరతలామలకం….
మార్చి 14 న చైనా రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ను భారత ప్రభుత్వం నియమించింది. చైనా ప్రభుత్వం ఈయనకు ఘన స్వాగతమే పలికింది. ఆయన్ను ఆకాశినికి ఎత్తేస్తూ చైనా ప్రభుత్వం వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రదీప్ రావత్కు చైనా భాష అద్భుతంగా తెలుసు కాబట్టి… భారత్, చైనా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని, ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని చైనా ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.