పాట్నా, మే 16: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో సీబీఐ అధికారులు మంగళవారం బీహార్లోని భోజ్పుర్ జిల్లాలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సన్నిహితులు, ఆర్జేడీ ఎమ్మెల్యేల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఆర్జేడీ ఎమ్మెల్యే కిరణ్దేవి యాదవ్ స్వస్థలంతో పాటు, ఆమె భర్త అరుణ్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. లాలూ సన్నిహితుడైన మాజీ మంత్రి ప్రేమ్గుప్తాకి చెందిన ఢిల్లీ, నోయిడాలోని నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు చేశారు. కాగా, ఈ కేసులో సీబీఐ ఇప్పటికే లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్, ఇతర కుటుంబసభ్యులను ప్రశ్నించింది.