న్యూఢిల్లీ: కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ(Justice Abhijit Gangopadhyay) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ శివగ్ననమ్ను కలుసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తొలుత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన రాజీనామాను ఆయన ప్రకటించాలనుకున్నారు. కానీ భారీ సమూహాలపై నిషేధ ఆజ్ఞలు ఉన్న కారణంగా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ను రద్దు చేశారు.
గంగోపాధ్యాయ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్లోని తామ్లుక్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ టికెట్పై పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తామ్లుక్ స్థానంలో సాధారణగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. 2009 నుంచి 2016 వరకు ఆ స్థానం నుంచి సువేంధు అధికారి గెలిచారు. ఆ సమయంలో ఆయన్ను సీఎం మమతాకు రైట్హ్యాండ్గా భావించారు.