లక్నో: ఈ నెల 19 నుంచి జరిగే తొలి దశ పోలింగ్ నుంచే బీజేపీ ఓటమి ప్రారంభమవుతుందని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. రాజ్పుత్లు, క్షత్రియుల ఆగ్రహావేశాలు బీజేపీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని మీడియాతో చెప్పారు. ‘ఓటు వేసే అవకాశం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ చెప్పేవన్నీ అవాస్తవం. వారు తప్పుడు వాగ్దానాలు చేశారు. మొదటి దశ ఓటింగ్ నుంచే ఓటమిని బీజేపీ ఎదుర్కొంటుంది’ అని అన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఎస్పీ విజయం సాధిస్తుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈసారి స్పష్టమైన సందేశం ఇస్తారని, బీజేపీకి వాస్తవికతను చూపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. మొదటి దశ పోలింగ్లో ఉత్తరప్రదేశ్ ప్రజల స్పందన ఎస్పీకి స్పష్టమైన విజయానికి దారితీస్తుందని అన్నారు. వెనుకబడిన, దళిత, మైనారిటీలతో కూడిన పీడీఏ, ఎన్డీయేను తప్పకుండా ఓడిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్డీయేకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు పీడీఏ వైపు ఉంటారని అన్నారు.