న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ(Mohammad Shami).. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సు ఉంది. బెంగాల్ జట్టు తరపున రంజీ ట్రోఫీలో షమీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ ఎంట్రీపై ఇప్పటి వరకు షమీ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. కానీ బెంగాల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయపడ్డ షమీ .. సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. స్పీడ్గా కోలుకోవాలని ప్రధాని మోదీ అతనికి విషెస్ కూడా చెప్పారు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీశాడతను.