లక్నో: దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత మరణించారు. కార్డు ఇచ్చే నెపంతో ఆయనను ఆపిన గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపి హత్య చేశారు. (BJP leader shot dead) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం సికరారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధ్పూర్ గ్రామంలో మలుపు వద్ద బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడైన 55 ఏళ్ల ప్రమోద్ యాదవ్ను బైక్పై వచ్చిన వ్యక్తులు ఆపారు. కార్డు ఇచ్చే నెపంతో ఆయన వద్దకు వచ్చి గన్తో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం బైక్పై పారిపోయారు.
కాగా, తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ యాదవ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హంతకులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రమోద్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మల్హానీ స్థానం నుంచి బీజేపీ తరుఫున పోటీ చేశారు. మాజీ ఎంపీ, బలమైన వ్యక్తి ధనంజయ్ సింగ్ మాజీ భార్య జాగృతి సింగ్కు వ్యతిరేకంగా బరిలో నిలిచారు.