ముంబై : కాంట్రాక్టు రద్దు చేసుకున్నా తన ప్రకటనలను నిలిపివేయనందుకు పాన్ మసాలా బ్రాండ్ కమలా పసంద్కు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచన్ సోమవారం లీగల్ నోటీసులు పంపారు. జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ కోరిన మీదట ఈ ప్రకటనల కాంట్రాక్టును అమితాబ్ రద్దు చేసుకుని తనకు చెల్లించిన మొత్తాన్ని కంపెనీకి తిరిగిఇచ్చారు.
యువతలో పొగాకు అలవాటును ప్రోత్సహించేలా ఉన్న పాన్ మసాలా ప్రకటనకు దూరంగా ఉండాలని అమితాబ్ నిర్ణయించుకున్నారు. తనతో కాంట్రాక్టు రద్దు చేయాలని కూడా సదరు కంపెనీని బిగ్బీ కోరారు. అయితే కాంట్రాక్టు రద్దు చేసుకున్న తర్వాత కూడా ప్రకటనను నిలిపివేయకపోవడంతో ఆయన కమలా పసంద్కు నోటీసులు పంపారు.కాగా భారత్లో మరణాలు, వ్యాధులకు పొగాకు వాడకం ప్రధాన కారణంగా ఉందని, పొగాకు వాడకంతో ఏటా 13.5 లక్షల మంది మృత్యువాతన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వెల్లడించింది.