న్యూఢిల్లీ, మార్చి 25: వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో శుక్రవారం భారత్బంద్కు రైతుసంఘాల వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేపట్టి 4 నెలలవుతున్న నేపథ్యంలో ఈ పిలుపునిచ్చింది. ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, పుదుచ్చేరికి బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్లో తాము పాల్గొనబోమని అఖిల భారత వర్తకుల సమాఖ్య స్పష్టం చేసింది.