లక్నో : దేశంలోనే పది అత్యంత కాలుష్య నగరాల్లో తొమ్మిది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఘటంపూర్, జౌన్పూర్ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో బనరాస్ నిలిచింది. ఘటంపూర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 33, జౌన్పూర్లో 325, బనారస్లో ఎయిర్ ఏక్యూఐ 282గా నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, గాలిలో కాలుష్య కారణాల కారణంగా ఇటీవల గాలి నాణ్యత సూచీ పడిపోయింది. ఏక్యూ ఎయిర్ (IQ Air) శనివారం డేటాను విడుదల చేసింది.
ఏక్యూ ఎయిర్ విడుదల చేసిన డేటా ప్రకారం.. పొల్యూషన్లో టాప్ పది నగరాల్లో ఘటంపూర్ (AQI -333), జౌన్పూర్ (325), వారణాసి (282), సీతాపూర్ (264), మడియాహున్ (258), ఉన్నావ్ (236), నాన్పారా (227), పాట్నా (222), అక్బర్పూర్ (219), కాన్పూర్ (204) ఉన్నాయి. గత డిసెంబర్ నుంచి పలు నగరాల్లో వాయు నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. చలి కారణంగా కాలుష్యం మరింత పెరుగుతున్నది. దీంతో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పరిస్థితి దారుణంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.