న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న హరితహారం స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా చెట్లు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ మార్పులను అరికట్టేందుకు భారత్, అమెరికా సంయుక్తంగా రూ.200 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
భారత్లో అడవుల బయట 28 లక్షల హెక్టార్లలో చెట్లను పెంచనున్నారు. రైతులు, కంపెనీలు, ప్రైవేటు సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు.