ముంబై : ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసులో ఈ నెల 3న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ బెయిల్పై బాంబే హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 23 ఏండ్ల ఖాన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించనున్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఆర్యన్ ఖాన్ ఉన్నాడు. ఖాన్ బెయిల్ పిటిషన్ను ఇప్పటికే కోర్టు రెండు సార్లు తిరస్కరించింది.
ఇక ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్ఖాన్ను విడుదల చేయడానికి అతని తండ్రి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడేతో పాటు మరో ఇద్దరు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్టు ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సెయిల్ ఆరోపించారు. ఈ ఆరోపణలను ఎన్సీబీ తోసిపుచ్చింది. ఏజెన్సీపై దుష్ప్రచారం చేయడంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొంది.