డెహ్రాడూన్: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ప్రముఖ జ్యుయలరీ షోరూమ్లో ఖరీదైన బంగారు ఆభరణాలు లూఠీ చేశారు. (Jewels Showroom Loot) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 7 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతోపాటు గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు.
కాగా, రాష్ట్రపతి భద్రతా ఏర్పాట్లలో ఉత్తరాఖండ్ పోలీసులు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సాయుధులైన ఐదుగురు డెహ్రాడూన్లోని రిలయన్స్ జ్యుయలరీ షోరూమ్లోకి ప్రవేశించారు. గన్స్ చూపించి అక్కడి సిబ్బందిని బెదిరించారు. కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జ్యుయలరీ షోరూమ్కు వెళ్లారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నగల దోపిడీకి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देहरादून में रिलायंस ज्वेलरी शोरूम में करोड़ों की लूट का CCTV –
बदमाश कस्टमर बनाकर घुसे। सबको गन पॉइंट पर लिया। सोने और हीरे के जेवरात लूटकर भाग गए।
आज शहर में राष्ट्रपति थीं। सारा पुलिस फोर्स उनकी सुरक्षा में लगा था। बाकी फोर्स कल अमित शाह के आगमन की तैयारियों में बिजी था। https://t.co/dH0lMHJ9UR pic.twitter.com/ZTad7LC9Vx
— Sachin Gupta (@SachinGuptaUP) November 9, 2023