పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలి
అధికారులు, కాంట్రాక్టర్లు పనితీరును మార్చుకోవాలి
మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్
తూప్రాన్ రూరల్, మార్చి 24 : తూప్రాన్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్తో కలిసి బుధవారం ఆయన పట్టణంలో పర్యటించారు. ఇంటిగ్రేటెడ్, వేసైడ్ మార్కెట్ యా ర్డులు, వైకుంఠధామం,ఆర్అండ్బీ గెస్ట్హౌస్, మున్సిపల్ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి పనులకు రూ.కోట్లలో నిధు లు మంజూరైనప్పటికీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ పాలకవర్గం పర్యవేక్షణలో పనులు వేగవం తం చేయాలన్నారు. ఇక నుంచి తన దృష్టిని తూప్రాన్ పట్టణంపై కేంద్రీకరిస్తానని, వారంలో ఒక రోజు పట్టణంలో పర్యటిస్తానన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీకి అదనం గా నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు కలెక్టర్ హరీశ్కు వినతి పత్రం అందజేశారు. గురువారం తన కార్యాలయంలో కలిస్తే పనులపై చర్చిస్తానని చెప్పారు.
మొక్కల పెంపకం అమోఘం
పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటి సంరక్షిస్తున్న హరితహారం మొక్కల పెంపకాన్ని చూసి కలెక్టర్ మంత్రముగ్ధులయ్యారు. ఇదే తరహాలో పట్టణంలోని ప్రతీ గల్లిలో పెంచి గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వీలైనంత త్వరగా స్థలాన్ని సేకరించండి
మనోహరాబాద్, మార్చి 24 : వెజ్, నాన్వెజ్ మార్కెట్ కోసం వీలైనంత త్వరగా స్థలాన్ని సేకరించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశాల మేరకు కాళ్లకల్లోని ఎల్లారెడ్డికుంట, మాదన్నకుంటల పరిధిలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఎల్లారెడ్డి కుంటలోని సర్వే నెంబర్ 484లో 3.35 ఎకరాలు, మాదన్నకుంటలోని సర్వే నెంబర్ 496లో 4.14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.