న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఇన్స్పైరింగ్ పోస్ట్లు, స్ఫూర్తిదాయక వీడియోలతో నెటిజన్లలో ఆలోచన రేకెత్తించే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర తాజాగా పాత రోజులను, ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మహింద్ర గ్రూప్ చైర్మన్ పోస్ట్ చేసిన వీడియో మాంటేజ్ మనల్ని టెక్నాలజీపై ఆధారపడని కాలంలోకి తీసుకువెళుతోంది.
What a great journey down memory lane! Wonder if someone has collected these actual physical objects and displayed them in a museum? I think GenZ would enjoy seeing them…A kind of dinosaur museum 😊 pic.twitter.com/x8w2Row82E
— anand mahindra (@anandmahindra) January 6, 2023
క్యాసెట్ల నుంచి టైప్రైటర్ల వరకూ 1980, 1990 రోజుల్లో వాడిన వస్తువులను చూపుతూ పాత రోజులను పరిచయం చేస్తుంది. ఈ వీడియోలో అప్పటి మ్యాగజీన్, న్యూస్ పేపర్ ప్రకటనలూ కనిపిస్తాయి. జడ్ జనరేషన్ ఈ పోస్ట్తో బాగా కనెక్టవుతుంది. పాత జ్ఞాపకాల్లోకి అద్భుత ప్రయాణం..ఈ అపురూప వస్తువులను ఎవరైనా సేకరించి, మ్యూజియంలో డిస్ప్లే చేస్తే గొప్ప కార్యక్రమమే అవుతుంది కదా..!
వీటిని చూసి జడ్ జనరేషన్ ఎంజాయ్ చేస్తుందని అనుకుంటాను అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి రోజుల్లో స్నేహబంధమైనా, రిలేషన్షిప్ అయినా, ఆహార నాణ్యత, ఆ జనరేషన్ అన్నీ అసలు అది స్వర్ణయుగమే అని ఓ యూజర్ కామెంట్ చేశారు.