Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను పంచుకుంటారు. కొన్ని సరదాగా.. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ వస్తుంటారు. ఆయన షేర్ చేసిన పోస్ట్లు క్షణాల్లో వైరల్గా మారుతాయి. తాజాగా.. 47 సంవత్సరాల కిందట ఆయన తీసిన ఫొటోను ట్వీట్ చేయగా.. అది వైరల్గా మారింది.
‘నేను స్టూడెంట్ ఫొటోగ్రఫీ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు 1975లో స్పెయిన్లోని టోలెడోలో ఈ ఫొటోను తీశాను. 5జీ నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందున.. అత్యంత సమర్థవంతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎల్లప్పుడూ నోటి మాటగా ఉంటుందని ఇది నాకు గుర్తు చేసింది’ అంటూ ఫొటోను జత చేశారు. ఈ పోస్ట్ చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇప్పటి వరకు ఈ ట్వీట్కు 6వేలకుపైగా లైక్ చేయగా.. 300 మందికిపైగా రీ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా ఫొటోగ్రఫీ ప్రతిభను చూసి, ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నిజంగా బ్యూటీఫుల్ షాట్ సర్’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘మీకు ఫొటోగ్రఫీలో మంచి నైపుణ్యం’ ఉంది అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ‘బాగా చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా మీడియా మాత్రమే మారిపోయింది’ అంటూ మరో నెటిజన్ పేర్కొడు.
Took this pic in Toledo, Spain in 1975 when I was doing a student photography project. As 5G networks roll out around the world, this reminded me that the most efficient communication network will always be word of mouth…😊 pic.twitter.com/jWj6NJCsNx
— anand mahindra (@anandmahindra) August 13, 2022