న్యూఢిల్లీ, నవంబర్ 21: కొవిడ్ టీకా యువతలో ఆకస్మిక మరణాల ముప్పును తగ్గించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. కనీసం ఒక డోసు తీసుకున్నా ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేలింది.
ఈ అధ్యయన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలను నిగ్గుతేల్చేందుకు 2021 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో ఓ అధ్యయనాన్ని చేపట్టిన ఐసీఎంఆర్.. ఆకస్మికంగా మరణించిన 18-45 ఏండ్ల వయసు వ్యక్తుల కేసులను పరిశీలించింది.