కాసర్గోడ్, జనవరి 3: అమెరికాలో ప్రవాస భారతీయురాలు జూలీ మాథ్యూ చరిత్ర సృష్టించారు. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టు జడ్జిగా ఆమె వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆండ్రూపైన ఆమె విజయం సాధించారు. జూలీది కేరళలోని వెన్నికులం అనే గ్రామం. చిన్నప్పుడు ఇదే గ్రామంలో చదువుకున్నారు.
తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పుడే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తన తండ్రి వ్యాపారంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు చూసిన తర్వాత ఆమె లా చదవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏండ్లు అమెరికాలో న్యాయవాదిగా పనిచేసిన తర్వాత నాలుగేండ్ల క్రితం మొదటిసారి ఆమె జడ్జిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వరుసగా రెండోసారి ఆమె ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈ సారి ఆమె కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్ల గ్రామంలో గల తన మెట్టినింటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిగా ప్రమాణం చేశారు.