Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే జూన్ నుంచి 30 యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమర్నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సారి అమర్నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయించారు.
ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే, కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. గత రెండు సంవత్సరాల కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తుల రాకపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభుత్వం గణనీయంగా తగ్గడంతో.. దర్శనాలు, భక్తుల రాకపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడంతో ఈ సారి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం బోర్డు అంచనా వేస్తున్నది.