న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఘర్ ఘర్ తిరంగా ప్రచారోద్యమాన్ని బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) చీఫ్ సిమ్రన్జిత్ సింగ్ మాన్ పిలుపు ఇచ్చారు. తిరంగా క్యాంపెయిన్ను బహిష్కరించి ఈనెల 14-15 తేదీల్లో ఇండ్లు, కార్యాలయాలపై సిక్కుల జెండాను ఎగురవేయాలని సంగ్రూర్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిక్కులు స్వతంత్రులని, భిన్న వర్గీయులని దీప్ సిద్ధూ చెబుతుంటారని అన్నారు.
భారత బలగాలను శత్రు సేనలుగా అభివర్ణించిన మాన్ శత్రు సేనలతో పోరాడుతూ జర్నైల్ సింగ్ బింద్రన్వాలే (ఖలిస్తానీ ఉగ్రవాది) మరణించాడని పేర్కొన్నారు. మరోవైపు పంజాబీలను రెచ్చగొట్టేలా మువ్వన్నెల జెండాను దగ్ధం చేయాలని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఖలిస్తానీ జెండాను ఎగరేయాలని వీడియో మెసేజ్లో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సిక్కులను కోరడం కలకలం రేపింది.