రాజస్థాన్ సీఎం గెహ్లోత్ సలహాదారు, ఎమ్మెల్యే సన్యమ్ లోథా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… నాతో సహా కాంగ్రెస్ నేతలందరూ గాంధీ- నెహ్రూ కుటుంబానికి బానిసలమే అంటూ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో హరిదేవ్ జోషి యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం సవరణ బిల్లు 2022 చర్చ జరుగుతున్న సందర్భంలో.. లోథా మధ్యలో కల్పించుకొని మరీ.. పై వ్యాఖ్యలు చేశారు.
”అవును… మేము గాంధీ- నెహ్రూ కుటుంబానికి బానిసలమే. మా చివరి శ్వాస వరకూ ఇలాగే వుంటాం. ఆ కుటుంబం ఈ దేశాన్ని నిర్మించింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ ఘాటుగా స్పందించారు. ”ఓహో మీరు బానిసలా… ఇదో కొత్త సంస్కృతి వచ్చి చేరింది. మీ బానిస బతులకులకు శుభాకాంక్షలు” అంటూ రాజేంద్ర రాథోడ్ చురకలంటించారు.