పాట్నా: వారం కిందట అదృశ్యమైన పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాల్పులు జరిపి ఆయనను హత్య చేసినట్లు అనుమానించారు. కనుగుడ్లు పెకలించడంతోపాటు ప్రైవేట్ భాగాలు కోసి ఉండటం చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఆందోళనకు దిగిన స్థానికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతోపాటు ఒక వాహనానికి నిప్పంటించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. (Tension In Bihar) బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దానాపూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మనోజ్ కుమార్ స్థానిక శివాలయంలో పూజారి. సోమవారం మధ్య రాత్రి తర్వాత గుడి నుంచి బయటకు వెళ్లిన ఆయన అదృశ్యమయ్యాడు. బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడైన అశోక్ కుమార్ షా తన సోదరుడు మనోజ్ మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, శనివారం గ్రామ శివారులోని చెట్లపొదల్లో పూజారి మనోజ్ కుమార్ మృతదేహం కనిపించింది. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. అలాగే కనుగుడ్లు పెకలించి ఉన్నాయి. నాలుక, ప్రైవేట్ భాగం వద్ద కోసిన గాయాలున్నాయి. ఈ విషయం తెలుస్తున్న గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసనకు దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
మరోవైపు గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీస్ బలగాలను రప్పించారు. అక్కడి పరిస్థితిని అదుపు చేశారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని పోలీస్ అధికారి తెలిపారు. పూజారి హత్య ఘటన, అనంతరం జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#BIHAR बीजेपी नेता के भाई की जीभ काटी..आंखें निकाली प्राइवेट पार्ट को भी काटा:पांच दिनों बाद मिला शव, लोगों ने पुलिस पर किया पथराव; SDPO के गार्ड घायल@BJP4Bihar @samrat4bjp #Gopalganj #biharnews @VijayKrSinhaBih pic.twitter.com/41s68GBJPo
— FirstBiharJharkhand (@firstbiharnews) December 16, 2023