కోల్కతా, సెప్టెంబర్ 19: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.25 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును అదానీకి కట్టబెట్టారు. తాజ్పూర్లోని గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టును అభివృద్ధి చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అదానీ పోర్ట్స్కు అంగీకార పత్రం ఇచ్చేందుకు సోమవారం బెంగాల్ క్యాబినెట్ ఆమో దం తెలిపింది. ‘సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు కొలిక్కి వచ్చాక, విజయవంతమైన బిడ్డర్గా నిలిచిన అదానీ పోర్ట్స్కు అంగీకార పత్రం ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఆ పత్రాన్ని బెంగాల్ మరిటైం బోర్డు అందజేస్తుంది’ అని ఆ రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 25 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, అంతకు కొన్ని గంటల ముందే అసెంబ్లీలో మాట్లాడిన మమత.. ‘సీబీఐ, ఈడీ దాడుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదు’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.