ముంబై: బీమా కోరేగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది సుధా భరద్వాజ్ గురువారం జైలు నుంచి విడుదల కానున్నారు. రూ.50 వేల పూచీకత్తుపై ఆమెను విడుదల చేసేందుకు ఎన్ఐఏ కోర్టు అనుమతించింది. అనుమతి లేనిదే ముంబై విడిచి వెళ్లరాదని, పాస్పోర్టును సరండర్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. ఆమెకు డిఫాల్ట్ బెయిల్ మంజూ రు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.