న్యూఢిల్లీ, మే 6: ఏఐ టెక్నాలజీ ఓటర్లను తప్పుదోవ పట్టించగలదని ఓ అధ్యయనంలో తేలింది. ఏఐకి భావోద్వేగాలు ఉండవని, అది తప్పుడు సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉన్నట్టు గుర్తించారు.
హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాటా సైంటిస్ట్ శాండర్స్, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ లెక్చరర్ స్కీయర్ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. నాయకులు ఇచ్చే తప్పుడు సమాచారం ద్వారా ఓటర్లను ఏఐ తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని గుర్తించారు. ఓటర్ పోలరైజేషన్ జరిగే ప్రమాదం ఉందని కనుగొన్నారు. దీనికి సోషల్ మీడియా వేదికగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు.