థానే: మహారాష్ట్ర పోలీసులు సుమారు 8 వేల కిలోల ఆవు మాంసాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. అక్రమంగా బీఫ్ను తరలిస్తున్నట్లు థానే నగర పోలీసులు కేసు బుక్ చేశారు. నాసిక్-ముంబై హైవేపై ఉన్న ఖారేగావ్ టోల్ వద్ద ఓ టెంపోను అడ్డుకున్న పోలీసులు ఆ వాహనంలో అక్రమంగా బీఫ్ తరలిస్తున్నట్లు గుర్తించారు. నాసిక్ జిల్లాలోని మాలేగావ్ నుంచి ముంబై సమీపంలోని కుర్లా ఆ మాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఆ మాంసం ఖరీదు సుమారు 8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. టెంపోను కూడా సీజ్ చేశారు. అదపులోకి తీసుకున్న ఇద్దర్ని రాయిస్ అహ్మద్ సలామ్ ఖురేషి, అబ్దుల్ అహ్మద్ నసీమ్ ఖాన్లు గుర్తించారు. గోవును వధించడం, గో మాంసాన్ని అక్రమంగా తరలించడంపై రాష్ట్రంలో నిషేధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగైదు రోజుల నుంచి పోలీసులు సుమారు 14 టన్నుల బీఫ్ను పట్టుకున్నారు.