లక్నో: కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 9 మంది కార్మికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఢిల్లీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ధౌలానా పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయారు. 15 మందికిపైగా గాయపడ్డారు. కార్మికుల మృతదేహాలు, గాయపడిన వారితో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. పలువురు కార్మికులు ఫ్యాక్టరీ లోపల చిక్కుకుపోగా, కొందరు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
మరోవైపు కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలతో హాపూర్ జిల్లా కలెక్టర్ మేఘ, ఇతర అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. రెస్క్యూ చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని మీడియాతో అన్నారు.
8 Killed In Explosion, Fire At Chemical Factory Near Delhi https://t.co/3gzEwHPStO
NDTV's Ravish Ranjan reports pic.twitter.com/M0T7NfKk6a
— NDTV (@ndtv) June 4, 2022