Omicron Threat | యావత్ ప్రపంచాన్ని కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. కానీ దాని గురించి ఏ మాత్రం భయపడకుండా ఇప్పటి నుంచి వచ్చే మూడు నెలల్లో అంటే.. మార్చి వరకు ప్రయాణాలు చేయాలని 58 శాతం మంది ఇండియన్స్ ప్లాన్లు వేసుకున్నారట. ప్రస్తుతం ప్రయాణ ఆంక్షలు అమలులో ఉన్నా 18 శాతం మంది ట్రావెల్ బుకింగ్స్ చేసుకున్నామని చెప్పారు. మరో 22 శాతం మంది ఇంకా టికెట్లు బుక్ చేసుకోలేదన్నారు. వీరిలో 21 శాతం మంది పర్యాటక కేంద్రానికి కుటుంబ సమేతంగా వెళ్లాలని భావిస్తున్నారు. 49 శాతం మంది కుటుంబం, బంధు మిత్రులకు కలవడానికి ప్రాధాన్యం చూపుతున్నారు.
మరో 14 శాతం మంది సినిమా హాళ్లు లేదా మల్టీఫ్లెక్స్లకు వెళ్లి సినిమాలు చూడాలని భావిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనం అభిప్రాయ పడింది. జూలైలో ఇదే అంశంపై సర్వే చేసినప్పుడు 40 శాతం మందికి పైగా సినిమాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు నాటి లోకల్ సర్కల్స్ సర్వేలో చెప్పారు. 138 కోట్ల మంది ఇండియన్స్లో 19 కోట్ల మంది సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో చూడాలని ఆశిస్తున్నారు.
ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. కేసులు మరింత వ్యాపిస్తే సినిమా థియేటర్లను మూసేయాల్సిందేనని లోకల్ సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా చెప్పారు. దేశవ్యాప్తంగా 320 జిల్లాల్లో 19,500 మంది నుంచి లోకల్ సర్కిల్స్ అభిప్రాయాలు సేకరించింది.