అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్ ప్రభావం తయారీరంగంపై తీవ్రంగా పడింది. రాకపోకలు నిలిచిపోవడంతో సైప్లె చైన్పై ప్రభావం పడింది. ఫలితంగా 2021 తొలి త్రైమాసికం (మార్చి- జూన్)లో తయారీ రంగం ఏకంగా 39.3 శాతం క్షీణించింది. అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల తయారీరంగం జూన్లో కొంత కోలుకుంది.. లాక్డౌన్లో ఉత్పత్తి నిలిచిపోయి, ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయి, కీలక రంగాలన్నీ నేలచూపులు చూసిన వేళ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నది వ్యవసాయ రంగం.
కరోనా మహమ్మారిని మొదట్లోనే అడ్డుకోవడం కోసం జనతా కర్ఫ్యూ విధించి సంవత్సరం పూర్తయింది. ఆ తరువాత దేశంలో లాక్డౌన్ విధించారు. అనంతరం పలు విడతలుగా సడలింపులిచ్చి మొత్తంగా ఎత్తేశారు. ఇప్పుడు మరోసారి కరోనా తీవ్రరూపం ధరిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రజలను కలవరపరిచి, ఆరోగ్యవ్యవస్థతోపాటు దేశ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ పరిణామంపై పకడ్బందీ వ్యూహరచన, కార్యాచరణ అత్యంత అవసరం.
అంతా సర్దుకుంటున్నదనుకుంటున్న నేపథ్యంలో తాజా పరిస్థితి మళ్ళీ కలవరం రేపుతున్నది. మళ్ళీ లాక్డౌన్ విధించే పరిస్థితులు లేకపోలేదనే భయాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అటూఇటుగా ఊగిసలాడుతున్నది.
అన్ని సంక్షోభాలు వేరు. కరోనా సంక్షోభం వేరు. వేరే ఏ సంక్షోభాలయినా ఏ కొద్దిరోజులో ప్రభావం చూపుతాయి. ఏవో కొన్ని రంగాలకు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతాయి. కానీ కరోనా సంక్షోభం పట్టు విడవకుండా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అన్ని దేశాల్లాగే భారతదేశంలోనూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది. కీలక రంగాలన్నీ కుదేలయ్యాయి. అప్పటికే వృద్ధిరేటు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా మరింత కుంగదీసింది. దేశంలో 2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి- మార్చి)లో జీడీపీ పదకొండేండ్ల కనిష్ఠానికి పడిపోయి 3.1 శాతానికి పరిమితమైంది. ప్రభుత్వం పోయిన సంవత్సరం ఇదే నెలలో (మార్చి చివరివారం) దేశవ్యాప్త లాక్డౌన్ విధించగా పరిస్థితులు మరింత కఠినంగా మారిపోయాయి. పరిశ్రమలు, వాణిజ్యం, మార్కెట్లు పతనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ నిలకడ కోల్పోయింది. ఫలితంగా ఆ తర్వాతి త్రైమాసికంలో జీడీపీ అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఏప్రిల్- జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం దిగజారింది. సెప్టెంబర్ నాటికి కార్యకలాపాలు కొంత పుంజుకున్నా జీడీపీ వృద్ధి మాత్రం ప్రతికూల పథంలోనే కొనసాగింది. మైనస్ 7.5 శాతం వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ సాంకేతికంగా సంక్షోభంలో పడిపోయింది.
అకస్మాత్తుగా విధించిన లాక్డౌన్ ప్రభావం తయారీరంగంపై తీవ్రంగా పడింది. రాకపోకలు నిలిచిపోవడంతో సైప్లె చైన్పై ప్రభావం పడింది. ఫలితంగా తొలి త్రైమాసికం (మార్చి- జూన్)లో తయారీరంగం ఏకంగా 39.3 శాతం క్షీణించింది. అన్లాక్ ప్రక్రియ ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల తయారీరంగం జూన్లో కొంత కోలుకుంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధి నమోదయింది.
లాక్డౌన్లో ఉత్పత్తి నిలిచిపోయి, ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయి, కీలక రంగాలన్నీ నేలచూపులు చూసిన వేళ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నది వ్యవసాయ రంగం. అద్భుతమైన పనితీరుతో జీడీపీ వృద్ధిరేటు మరింత పడిపోకుండా వ్యవసాయ రంగం తోడ్పడింది. సంక్షోభంలో ఆశాకిరణంలా నిలిచింది. తయారీరంగం చతికిలపడ్డ తొలి త్రైమాసికంలో 3.4 శాతం వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలోనూ అదే వృద్ధిరేటును రికార్డు చేసి ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలిచింది. తొలినాళ్లలో పట్టణాల్లోనే అధిక కేసులు నమోదు కావడం, వలస కార్మికులు సొంతూళ్లకు పయనం కావడం వల్ల వ్యవసాయమే చాలామందికి జీవనాధారమైంది. కూలీల సమస్య లేకపోవడం, వ్యవసాయ పనులపై ఆంక్షలు లేకపోవడంవల్ల ఈ రంగం మంచి పనితీరు కనబరిచింది. అయితే వ్యవసాయ రంగాన్ని వేధించే సమస్య మాత్రం లాక్డౌన్లోనూ పరిష్కారం కాలేదు. ఆహార ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ.. రైతుల పంటలకు సరైన ధర లభించలేదు.
లాక్డౌన్లో ఉద్యోగాలకు కోత పడింది. నిరుద్యోగం రికార్డుస్థాయిలో పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం ఏప్రిల్- మే నెలల్లో దేశంలో నిరుద్యోగ రేటు 23.5 శాతంగా నమోదైంది. లాక్డౌన్ ముగిసి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల నిరుద్యోగం కొంతమేర తగ్గింది. జూన్లో 11 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్లో మరింత మెరుగై 6 శాతానికి తగ్గింది. ఈ గణాంకాలు చూసేందుకు బాగానే ఉన్నా.. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ఏడాదికిపైగా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ ప్రతిపాదిత లక్ష్యానికిపైనే కొనసాగింది. ఏప్రిల్లో 7.2 శాతానికి పెరిగి, అక్టోబర్ నాటికి ఆరేండ్ల గరిష్ఠ స్థాయి అయిన 7.61 శాతానికి ఎగబాకింది. చివరకు నవంబర్లో 6.93 శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ లాక్డౌన్ ఎత్తివేత తర్వాత మెరుగుపడింది. ఆర్బీఐ సైతం 2020-21కి భారత వృద్ధి రేటును -9.5 శాతం నుంచి -7.5 శాతానికి సవరించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ఢోకా ఉండబోదని అంచనా. అయితే అంతా సర్దుకుంటున్నదనుకుంటున్న నేపథ్యంలో తాజా పరిస్థితి మళ్ళీ కలవరం రేపుతున్నది. మళ్ళీ లాక్డౌన్ విధించే పరిస్థితులు లేకపోలేదనే భయాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అటూఇటుగా ఊగిసలాడుతున్నది.
శ్రీనివాస్గౌడ్ ముద్దం