లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ 25 ఏళ్ల యువకుడు తన భార్యకు విడాకులు ఇచ్చి ఆ సందర్భాన్ని భక్తితో సెలబ్రేట్ చేసుకున్నాడు. బస్తీ గ్రామానికి చెందిన జోగేశ్ అనే వ్యక్తి.. దండవత్ యాత్ర(Dandvat Yatra) చేపట్టాడు. సుమారు 9 కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ జర్నీ చేపట్టాడు. స్థానిక గ్రామ దేవత బైదా సామే మాతా ఆలయం వరకు ఆ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు కదిలాడు. ఆ యాత్ర సమయంలో అతని పేరెంట్స్, మిత్రులు అతనికి సహకరించారు.
ఉదయం ఆరు గంటలకే ఇంటి నుంచి బయలు దేరిన ఆ వ్యక్తి 9 కిలోమీటర్ల దూరం చేరేందుకు సుమారు 12 గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది. 2022లో అతను పెళ్లి చేసుకున్నాడు. కానీ తరుచూ భార్యతో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో అతను విడాకులు దరఖాస్తు చేసుకున్నాడు. జనవరిలో అతనికి విడాకులు మంజూరీ అయ్యాయి. దీంతో అతను గ్రామదేవతకు మొక్కు తీర్చుకున్నాడు. స్థానిక పోలీసుల పహారాలో ఆ వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తూ యాత్ర కొనసాగించాడు.
At a time when divorce parties are emerging as a new hot invite, a 25-year-old man from Basti celebrated the personal milestone with a unique thanksgiving for the local deity.
Making the most of the auspicious occasion of Navratri, the newly-divorced man undertook a 9-km… pic.twitter.com/SZlQqvRMyn
— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026