ఇంఫాల్, ఫిబ్రవరి 28: మణిపూర్ రాష్ట్రంలో కొందరు దుండగులు అదనపు ఎస్పీపై దాడి చేసి కిడ్నాప్నకు పాల్పడటంపై మణిపూర్ పోలీస్ కమాండోలు వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు వెయ్యి మంది కమాండోలు బుధవారం ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు.
అదనపు ఎస్పీని వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని మైతీ, ఇతర ఉగ్రవాద సంస్థలకు ఐదు లోయ ప్రాంత జిల్లాలకు చెందిన కమాండోలు హెచ్చరించారు.