న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతుండగా, మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో జనం బారులు తీరి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 17,23,912 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటివరకు చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 28,27,03,789కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.