న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్లో ఉన్న కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారనే సమాచారం రాగానే ఆప్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు వందలాదిగా చేరుకున్నారు.
బీజేపీకి, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈడీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు. దీంతో పోలీసులు ఆప్ ఎమ్మెల్యేలు జర్నైల్ సింగ్, రుతురాజ్, జై భగవాన్, అబ్దుల్ రెహమాన్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు.